ఐపీఎల్: ధోనీ ని సమర్థిస్తున్న మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా..

-

ఐపీఎల్ లో ఫేవరేట్ గా దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఆరంభంలో జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచులో గెలిచినప్పటికీ, ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ వచ్చింది. గాయం కారణంగా అంబటి రాయుడు ఇంటికి దూరమవడం, ధోనీ ఏడవ స్థానంలో బ్యాటింగ్ కి దిగడం మొదలగు కారణాల వల్ల ఓడిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. ధోనీ ఫిట్ నెస్ పై కూడా విమర్శలు వచ్చాయి. ధోనీ పనైపోయిందంట్లూ కామెంట్లు పడ్డాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ మాజీ క్రికెటర్లు సైతం ధోనీ ఆటతీరుని తప్పు బట్టారు.

ఐతే మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా, ధోనీని సమర్థిస్తూ మాట్లాడాడు. క్రికెట్ అనేది టీమ్ ప్లే అనీ, ఒక్కడే ఏమీ చేయలేడని, అందరూ సమానంగా ఎఫర్ట్ పెడితేనే టీమ్ గెలుస్తుందని అంటున్నాడు. మ్యాచులో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ధోనీ ఎప్పుడు ముందుంటాడని, ఈ సీజన్లో అలాగే ప్రయత్నిస్తున్నాడని, కానీ ఒక్కడే ఏమీ చేయలేడని చెబుతున్నాడు. సన్ రైజర్స్ తో మ్యాచు ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడి 10వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news