ఐపీఎల్: ఢిల్లీపై సైకలాజికల్ అడ్వాంటేజీ మాదే.. రోహిత్ శర్మ.

-

ఐపీఎల్ 13వ సీజన్ చివరి దశకి వచ్చేసింది. నేడు జరగబోతున్న ఫైనల్ మ్యాచుతో టోర్నమెంట్ కథ ముగుస్తుంది. ఫైనల్ లో తలపడడానికి ఢిల్లీ, ముంబై ఇండియన్స్ రెడీగా ఉన్నాయి. నాలుగు సార్లు కప్పు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ తో మొదటిసారి ఫైనల్ కి చేరుకున్న ఢిల్లీ తలపడబోతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలని పరిశీలిస్తే ముంబైకే ఎక్కువగా అడ్వాంటేజీ ఉంది.

ఈ విషయాన్ని రోహిత్ శర్మ కూడా స్పష్టం చేసాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో మూడు సార్లు తలపడగా ఒక్కసారికూడా ఢిల్లీ గెలవలేకపోయింది. అందువల్ల ఆ భావన ముంబై ఆటగాళ్లకి సైకలాజికల్ బలం చేకూరుస్తుందని రోహిత్ శర్మ తెలిపాడు. ఐతే ఐపీఎల్ లో ప్రతీరోజూ తాజాగా మొదలవుతుందని, గత మ్యాచుల ఫలితాలని దృష్టిలో ఉంచుకుని తేలికగా తీసుకోవడానికి లేదని, అందువల్ల ఢిల్లీ తో మ్యాచుకి సిద్ధంగా ఉన్నామని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news