ఐపిఎల్ 2023: ఢిల్లీకి ప్రతి మ్యాచ్ “చావే”… గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు!

-

గత సీజన్ లో కనీసం ప్లే ఆఫ్ చేరిన సంతృప్తి అయినా ఢిల్లీ క్యాపిటల్స్ కు మిగిలింది. కానీ తాజాగా జరుగుతున్న సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆట మరీ తీసికట్టుగా తయారైంది. ఈ సీజన్ కు పంత్ దూరం కావడంతో ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు వార్నర్ పైనే ఢిల్లీ యాజమాన్యం ఆశలన్నీ పెట్టుకుంది. కానీ వార్నర్ బ్యాటింగ్ లో పర్వాలేదు అనిపిస్తున్నా , ఒక కెప్టెన్ గా మాత్రం జట్టును విజయపదంలో నడిపించడంలో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఢిల్లీ ఆడిన 8 మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.

ఇక ఈ టోర్నీలో మిగిలి ఉంది కొన్ని మ్యాచ్ లే మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా అన్ని మ్యాచ్ లను గెలుస్తూ పోవాలి. అందుకే ఢిల్లీ ఆడబోయే ప్రతి మ్యాచ్ చావే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఈ రోజు జరగనున్న గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచి టోర్నీలో నిలుస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version