ind vs rsa test : 202 ప‌రుగులకే టీమిండియా ఆలౌట్

-

సౌత్ ఆఫ్రికాతో టీమిండియా నేటి నుంచి రెండో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. అయితే మొద‌టి ఇన్నింగ్స్ లో టీమిండియా 202 ప‌రుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో భార‌త్ బ్యాట్ మెన్స్ దారుణంగా విఫ‌లం అయ్యారు. ఓపెన‌ర్ కెప్టెన్ కెఎల్ రాహ‌ల్ ఒక్క‌డే అర్థ శ‌త‌కం బాదాడు. అలాగే ఆల్ రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ 46 ప‌రుగులు చేసి స్కోర్ బోర్డును పెంచ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. అయితే సీనియ‌ర్ బ్యాట్స్ మెన్లు అజిక్యా రెహానే (0), చ‌తేశ్వ‌ర పుజారా (3) మ‌రో సారి విఫ‌లం అయ్యారు.

కాగ రెహానే , పుజారా ఇద్ద‌రు గ‌త కొద్ది రోజుల నుంచి దారుణంగా విఫ‌లం అవుతున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ లో విఫ‌లం అవుతే.. త‌ర్వాతి టెస్టు సిరీస్ ల‌కు వీరు దూరం అయ్యే అవ‌కాశం ఉంది. కాగ సౌత్ ఆఫ్రికా బౌల‌ర్లు టీమిండియా ను అద్భుతంగా క‌ట్ట‌డీ చేశారు. ర‌బ‌డా మ‌రో సారి కీల‌క వికెట్లను తీశాడు. ఈ మ్యాచ్ లో మొద‌టి ఇన్నింగ్స్ లో కూడా 3 వికెట్లును తీశారు. అలాగే ఆలివ‌ర్, మార్కో జాన్సెన్ త‌లో ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version