FLASH : టీఎస్ ఎంసెట్ పరీక్ష తేదీలు ఖరారు..!

-

కరోనావైరస్ కారణంగా వాయిదా పడిన చాలా కామన్ ఎంట్రన్స్ పరీక్షలను అన్‌లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి అనేక రాష్ట్రాలు. ఇప్పటికే టీఎస్ ఈసెట్ పరీక్ష పూర్తి అవ్వగా.. ఇప్పుడు టీఎస్ ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం రెడీ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చాలా పనులు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు తాజాగా.. పరీక్షా తేదీలను అనౌన్స్ చేసింది ప్రభుత్వం.

ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో టీఎస్ ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో టీఎస్ ఎంసెట్ పరీక్ష ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య ఒక సెషన్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రెండో సెషన్‌ను నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version