Telangana: దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ..!

-

Telangana: దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని ముందుకు వచ్చింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

దీపావళి పండుగ రోజు అమవాస్య కావడంతో ఆ తరువాత 1 లేదా రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ గృహాలను నిర్మించనున్నట్టు తెలిపారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీ తంగా గ్రామ సభలు నిర్వహించి బహు పేదలను పారదర్శకంగా ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అదేవిధంగా భూముల కేటాయింపు పై జరుగుతున్న ప్రచారం పై స్పందిస్తూ.. ఎవ్వ రికీ ఏ రకమైన భూములు కేటాయించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version