TS : ప్రేమించలేదని యువతికి పురుగుల మందు తాగించి హత్య

-

 

కొమరంభీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదని యువతికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు. ఈ సంఘటన ఇవాళ ఉదయం కొమరంభీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… ప్రేమించలేదని యువతిని పురుగుల మందు తాగించి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు.

సిర్పూర్ టి మండలంలోని వెంకట్రావ్ పెట్ గ్రామానికి చెందిన బూడే దీప (19) పురుగుల మందు బలవంతంగా తాగించాడు అదే గ్రామానికి చెందిన దంద్రే కమలాకర్. దీంతో బూడే దీప (19) ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ తరుణంలోనే.. కరీంనగర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ దీప మృతి చెందింది.

కమలాకర్ కు ఇది వరకే వివాహాం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నట్ల సమాచారం అందుతోంది. తనను ప్రేమించాలని దీప వెంట పడ్డాడు కమలాకర్. అయితే.. ప్రేమను దీప నిరాకరించడం తో కుటుంబ సభ్యులను చంపేస్తా నని బెదిరింపులకు దిగాడు కమలాకర్‌. ఇక మృతురాలు దీప అన్న పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… దంద్రే కమలాకర్ ను అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version