తెలంగాణాలో మరొకరిని చంపేసిన పులి…!

-

తెలంగాణాలో ఇప్పుడు ప్రజలను పులులు భయపెడుతున్నాయి. ఎక్కడో ఒక చోట పులుల హడావుడి ఆందోళన కలిగిస్తూనే ఉంది. తాజాగా ఒక పులి చుక్కలు చూపించింది. కొమురం భీం జిల్లాలో మరొకరిని పెద్ద పులి చంపేసింది. పెంచి కల్ పేట్ మండలం కొండపల్లి గ్రామ శివారు లో పెద్ద పులి దాడిలో యువతి మృతి చెందింది. పంట చేనులో పత్తి ఏరుతున్న నిర్మల అనే యువతిని పులి చంపేసింది.

ఈ నెల 11న దహేగం మండలం దిగిడ అటవీ ప్రాంతంలో విఘ్నేష్ అనే యువకుడిని హతమార్చిన పులి… ఆ తర్వాత కనపడలేదు. పులిని బంధించేందుకు కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికీ పులి ఆచూకీ దొరకలేదు. తాజా దాడితో అటవీ గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విచారణ జరుపుతున్న అటవీశాఖ అధికారులు… సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news