ఎమ్మెల్సీగా పల్లా ఒక్కసారి కూడా జనగామ వైపు చూడలేదు – ముత్తిరెడ్డి

-

బీఆర్ఎస్ లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్ పెడుతున్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జరగడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కేటాయించబోతున్నట్లు ప్రచారం జరగడంతో ముత్తిరెడ్డి మద్దతుదారులు పెద్ద ఎత్తున జనగామ చౌరస్తాలో నిరసనలు చేపట్టారు.

ఇక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పై మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. పార్టీ సిద్ధాంతాలను మరిచి పల్లా జనగామలో రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. మొదటి విడతలోనే తనకు జనగామ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో తాను జనగామను ఎంతగానో అభివృద్ధి చేశానని.. కానీ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్కసారి కూడా జనగామ వైపు చూడలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version