BRS పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది – బండి సంజయ్

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీఆర్ఎస్‌ స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది.. బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఎంఐఎం చూస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఐఎంకు దమ్ముంటే అన్ని చోట్ల పోటీ చేయాలని కోరాడు బండి సంజయ్‌. ఎంఐఎంను ముస్లింలు చీత్కరిస్తున్నారు. ఆ పార్టీని నమ్మడం లేదు.

15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న నీ తమ్ముడి వ్యాఖ్యలకు జవాబు చెప్పు… నీ ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తే ఉగ్రవాదుల నాయకుడు. వాళ్లకు షెల్టర్ ఇస్తూ ఆర్దిక సాయం ఇచ్చే పార్టీ నీది. టెర్రరిస్టులకు బెయిల్ ఇవ్వాలని వాదించిన పార్టీ నీది అంటూ రెచ్చిపోయారు బండి సంజయ్‌. సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే పార్టీ మీది. ఏనాడైనా సొంతంగా పోటీ చేసి అధికారంలోకి రావాలని కోరుకుందా? అని ప్రశ్నించారు. మీరు నిజంగా ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని భావిస్తే…తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయాలి. టీఆర్ఎస్ ను సంకలో వేసుకుని వస్తావా? ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని వస్తారా?..రండి…. బీజేపీ సింహం లెక్క సింగిల్ గా పోటీ చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version