టీఆర్ఎస్ లీడ్ వస్తేనే, ఫలితాలను రిలీజ్‌ చేస్తున్నారు – ఎన్నికల సంఘంపై బండి సంజయ్ ఫైర్‌

-

టీఆర్ఎస్ లీడ్ వస్తేనే, ఫలితాలను రిలీజ్‌ చేస్తున్నారని ఎన్నికల సంఘంపై బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరిపై బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయని సీఈవో.. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించలేదని నిప్పులు చెరిగారు.

మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్ కుమార్. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని.. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదు? అని నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news