కేసీఆర్‌పై కేసు పెట్టాలని రేవంత్‌రెడ్డికి చెప్పా: బండి సంజయ్‌

-

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.లక్ష కోట్ల స్కాం చేసిన కేసీఆర్‌పై కేసు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెప్పానని అన్నారు. కట్టె కాలే వరకు తెలంగాణ కోసం కొట్లాడతానని కేసీఆర్‌ కొత్త భాష మొదలు పెట్టారని మండిపడ్డారు.  ఆయన కట్టె కాలే వరకు తెలంగాణను దోచుకుంటారని ఎద్దేవా చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి మండలాల్లో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగింది. తెలంగాణ ప్రజలు పిట్ట కథలు చెబితే వింటారని, ఏ భాషలో మాట్లాడితే వింటారనే దానిలో కేసీఆర్‌ ఆరి తేరారని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే సర్పంచులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రశ్నించారు. ఒక్కో సర్పంచి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు అప్పులపాలయ్యారని తెలిపారు. మోదీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని..  కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తే రాముడికి వేసినట్లేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version