కాంగ్రెస్ పార్టీలో చేరిన గులాబీ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఒక్క పదవి కూడా లేదట !

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రోజురోజుకు… కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారం కోల్పోయిన గులాబీ పార్టీని ఒక్కో లీడర్ వదిలేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ నుంచి గెలిచి… ఇప్పుడు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. కెసిఆర్ ఎంత చెప్పినా కూడా… ఎవరు వినడం లేదు.

మరికొంతమంది ఎమ్మెల్యేలు… కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొన్న జీవన్ రెడ్డి అలక నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందట. గులాబీ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు ఇలాంటి పదవులు ఇవ్వకూడదని ఆదేశించిందట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ముఖ్యంగా మంత్రి పదవులు అస్సలు ఇవ్వకూడదని తేల్చి చెప్పిందట.

కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని వెల్లడించిందట. అయితే మంత్రి పదవి వస్తుందని ఆశపడి… కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version