BREAKING : చెన్నూరు, కొత్తగూడెం సీట్లు సీపీఐకి ఖరారు..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని భావించిన కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులను వివిధ దశల్లో వడబోసి ఎట్టకేలకు 58 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.

Chennuru and Kothagudem seats are finalized for CPI

ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాని ఈరోజు కాంగ్రెస్‌ విడుదల చేయనుంది. ఈ తరుణంలోనే.. చెన్నూరు, కొత్తగూడెం సీట్లు సీపీఐకి ఖరారు చేసింది కాంగ్రెస్‌ పార్టీ. కొత్తగూడెం నుంచి కూనం నేనీ సాంబ శివ రావు పోటీ చేయనున్నారు. ఈ మేరకు డి.రాజాకి ఫోన్ చేసిన కేసీ వేణుగోపాల్… చెన్నూరు, కొత్తగూడెం సీట్లు సీపీఐకి ఖరారు చేసినట్లు వివరించారు. ఇక సీపీఎం సీట్ల క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా చూస్తే.. వామపక్షాలు పొత్తుకు సంబంధించి ఐదుస్థానాలు పక్కన పెట్టారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version