జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

-

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అంతిమ‌యాత్ర‌లో విషాదం నెల‌కొంది. సియాస‌త్ ప‌త్రిక మేనేజింగ్ ఎడిట‌ర్ జ‌హీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. గ‌ద్ద‌ర్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనేందుకు జ‌హీరుద్దీన్ అల్వాల్ వెళ్లారు. ఛాతి నొప్పితో అలీఖాన్ కింద ప‌డిపోయారు. ఛాతి నొప్పితో అలీఖాన్ కింద ప‌డిపోయి… మరణించారు.

ఇక సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ శ్రీ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రికా ప్రపంచానికి తీరనిలోటని సీఎం అన్నారు. పత్రికా సంపాదకుడిగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్రను, వారి సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version