చిన్నారి మృతితో భగ్గుమన్న దమ్మాయిగూడ

-

మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ పరిధిలోని జవహర్‌ నగర్‌లో పదేళ్ల బాలిక ఇందు అనుమానాస్పద మృతి తీవ్ర దుమారం రేపింది. అంబేడ్కర్ నగర్ చెరువు నుంచి బాలిక మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేపించి జవహర్ నగర్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. బాలిక మృతికి గల కారణాలు తెలిపేలా పోస్టుమార్టం నిర్వహించి ఆ నివేదిక మృతురాలి కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశారు.

అంబులెన్స్‌లో నుంచి బాలిక మృతదేహాన్ని కిందకు దించకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసు వాహనం, అంబులెన్స్‌ గంట నుంచి అక్కడే ఉన్నాయి. స్థానికులు, బాలిక బంధువులు అడుగడుగునా అడ్డుకుని ధర్నాకు దిగారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానికుల ఆందోళనతో జవహర్‌నగర్‌లో రాకపోకలు నిలిచిపోయాయి. పోస్టుమార్టం నివేదిక ఇవ్వకుండా చిన్నారి మృతదేహం అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాప మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఒక దశలో పోలీసు వాహనంపై దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. చిన్నారి ఇందు మృతికి నిరసనగా దమ్మాయిగూడ జంక్షన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తి ర్యాలీని కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎక్స్రైషియా ప్రకటించాలని, ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version