టాయిలెట్స్ నుంచి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు కేంద్రమే ఇచ్చింది : ఎంపీ బండి సంజయ్

-

టాయిలెట్స్ నుంచి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ఎంపీ నిధుల నుంచి కరీంనగర్ జైల్లో అంబులెన్స్ ల్యాబ్ అందించారు. నేను ఏం చేశాను వినోద్ రావు వరంగల్ వెళ్లేటప్పుడు పొన్నం హుస్నాబాద్ లో తిరిగేటప్పుడు చూడాలన్నారు. కరీంనగర్ లో ఆర్ఓబి లేదా రైల్వే స్టేషన్ చూస్తే నేనేం చేశాను తెలుస్తుంది అన్నారు. స్మార్ట్ సిటీకి నిధులు ఎవరిచ్చారు లెక్కలు చూస్తే తెలుస్తది అన్నారు. L.K. అద్వాని కి భారతరత్న ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పెట్టిండియా ఎమర్జెన్సీ అయోధ్య వంటి పోరాటంలో పాల్గొన్న అద్వానికి భారతరత్న ఇవ్వడం సంతోషం అన్నారు.

టిఆర్ఎస్ ఎంపీ ఎన్నికల కోసం చేసిన సర్వే రిపోర్టు నా దగ్గరికి వచ్చిందని తెలిపారు. సర్వేలో అంతా బిజెపి మోడీ అని రావడంతో టిఆర్ఎస్ నాయకులు కంగారు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. దేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు బండి సంజయ్. టెర్రరిస్టులు ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వారు సపోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతుండటంతో ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ కూడా ఇలాగే మాట్లాడిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అయోధ్య రామాలయానికి అనుకూలంగా బిజెపి ఉందని తెలిపారు. దమ్ముంటే కాంగ్రెస్ వైఖరి ఏంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version