రేపటి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీదే : ఈటల రాజేందర్

-

రేపటి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీదేనని మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేయాలనే కాంక్షతో అన్ని వర్గాల ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ మొత్తంగా బీజేపీ చాలా శక్తివంతంగా ఉంది. సర్వేసంస్థలకు అందని, ఊహించని విధంగా ఈ జూన్ 4వ తేదీన గొప్ప అద్భుతం జరగబోతోంది. బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించబోతోంది అని జోస్యం చెప్పారు.

ప్రజల తీర్పు నిక్షిప్తంగా ఉంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నీచమైన మాటలు చెప్పిందో అవే మాటలు మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నాడు.  నేడు ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఎక్కడా బాంబుల పేలుళ్లు లేవు. అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. మేము ప్రచారం నిమిత్తం ఏ ఇంటికి పోయినా సాదరంగా ఆహ్వానించి బీజేపీకే ఓటు వేస్తామంటున్నారు.తెలంగాణలో ఖచ్చింతంగా అమిత్‌షా చెప్పినట్లు 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమాను వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్ర మేలు కోసం బీజేపీ ఎంపీగా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు ఈటల.

Read more RELATED
Recommended to you

Exit mobile version