శిల్పా చౌద‌రి బాధితుల్లో ప్ర‌ముఖ హీరో భార్య.. రూ. 2.5 కోట్లు మోసం

-

శిల్పా చౌద‌రి బాధితుల సంఖ్య రోజు రోజు కు పెరిగి పోతున్నారు. తాజా గా ప్ర‌ముఖ హీరో భార్య కూడా శిల్పా చౌద‌రి బాధితుల లీస్ట్ లో చేరింది. త‌న వ‌ద్ద నుంచి రూ. 2.5 కోట్ల ను ఎగ‌కొట్టార‌ని ఫీర్యాదు చేసింది. హీరో భార్య ఫీర్యాదు తో నార్సింగ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న కు శిల్పా చౌద‌రి కిట్టి పార్టీల తో ప‌రిచయం అయింద‌ని హీరో భార్య తెలిపింది. డబ్బుల కోసమే ప్రతి వారం కిట్టీ పార్టీ ఏర్పాటు చేసేద‌ని తెలిపింది. అన్ని డ‌బ్బుల ను ప్ర‌స్తుతం ఎగ‌కొట్టింది.

దీంతో శిల్పా చౌద‌రి బాధితులు పోలీసు స్టేష‌న్ ల‌కు క్యూ క‌డుతున్నారు. ఒక నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో నే మూడు కేసులు నమోదు అయ్యాయని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు తెలిపారు. శిల్ప చౌదరి ని తిరిగి పోలీసు కస్టడీ లోకి తీసుకుంటామ‌ని తెలిపారు. ఇప్ప‌టి కే శిల్పా చౌద‌రి కి సంబంధించి రెండు అకౌంట్లను ఫ్రీజ్ చేశామ‌ని తెలిపారు. అలాగే మ‌రి కొన్ని అకౌంట్లు ఉన్నట్లు గుర్తించామ‌ని అన్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం లో డ‌బ్బు ను శిల్పా చౌద‌రి ఎక్క‌డి కి త‌ర‌లిచార‌నే దాని పై తాము విచారిస్తున్నామ‌ని డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version