అదానీ, మోదీకి సంబంధాలు ఉన్నాయి – కేశవరావు సంచలన వ్యాఖ్యలు

-

అదానీ, మోదీకి సంబంధాలు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈడీలను ఏ విధంగా ఉపయోగిస్తుందో దానిపై లోక్సభలో, రాజ్యసభలో చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు కేశవ రావు. లిక్కర్ స్కామ్ ని కావాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీబీఐ, ఈడి రూల్స్ ప్రకారం పని చెయ్యాలన్నారు. అదాని,హేడెన్ బర్గ్ నివేదికపై చర్చ జరగాలి… సుప్రీం కోర్టు కమిటీ వేసిందని.. అధాని, మోదీకి సంబంధాలు ఉన్నాయని నిప్పులు చెరిగారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ కేశవరావు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఈరోజు బీజేపి ఎందుకు తెచ్చిందని.. ఈడి, సీబీఐ, గవర్నర్ వ్యవస్తపై చర్చ జరగాలన్నారు. ప్రతిపక్ష లీడర్లు అంతా కలిసి కట్టుగా ఉన్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version