కొండగట్టులో చిన్న హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ప్రారంభం

-

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు, హనుమాన్‌ దీక్షా పరులు తరలి వస్తున్నారు.  భక్తులు గుట్టపైకి చేరేందుకు రెండు బస్సులు ఉచితంగా నడపనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 24వ తేదీ వరకు ఆలయ ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు. 25 నుంచి మళ్లీయథావిథిగా కొనసాగుతాయని చెప్పారు.

హనుమాన్‌ మాల విరమణ చేయించేందుకు 300 మంది అర్చకులు, తలనీలాలు తీసేందుకు 15 వందల మంది నాయీబ్రహ్మణులు అందుబాటులో ఉంటారని ఆలయ ఈవో తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా  900 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేకువ జాము నుంచే భక్తుల రాకతో  రామ నామ స్మరణతో కొండగట్టు పరిసరాలు మారుమోగుతున్నాయి..  ఉదయం నుంచి 10 వేల మందికిపైగా దీక్షాపరులు మాల విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 24 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. హనుమన్‌ జయంతి సందర్భంగా అర్జిత సేవలు, వాహన పూజలు రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version