తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్‌

-

ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్… కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ నియోజక వర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే… ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్… సంచలన ప్రకటన చేశారు. తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు.

ఇవాళ హుస్నాబాద్ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. బండి సంజయ్ ను ఇంటికి పంపాలని ప్రజలను కోరారు. కరీంనగర్ ఎంపీ ఎవరని అడిగితే బండి సంజయ్ పేరు చెప్పడానికి తనకు సిగ్గుగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘కరీంనగర్ ఎంపీగా మళ్లీ వినోద్ ను గెలిపించాలి. బండి సంజయ్ ను ఇంటికి పంపాలి. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది. నల్ల డబ్బు తెస్తామని చెప్పినా బిజెపి సర్కార్ తెల్లముఖం వేసింది అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version