కాసేపట్లో హైదరాబాద్ లో మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశం

-

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్న ఆయన  మధ్యాహ్నం 12 గంటలకు తాజ్‌కృష్ణలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌లో జన జాతర సభకు హాజరవుతారు. ఖర్గే రాక సందర్భంగా నకిరేకల్‌లో కాంగ్రెస్‌ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. భువనగిరి అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ఖర్గే ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం పలుచోట్ల ప్రచార కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

మక్తల్, షాద్ నగర్, గోషామహల్ నియోజకర్గాల్లో సీఎం పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ జన జాతర సభకు హాజరు కానున్న రేవంత్‌రెడ్డి ఐదున్నరకు షాద్‌నగర్‌లో రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. రాత్రి 7గంటలకు హైదరాబాద్‌ గోషామహల్‌లో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. రాత్రి ఎనిమిదిన్నరకు తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో సీఎం పాల్గొంటారు. రేపు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కామారెడ్డి, తాండూర్‌ సభల్లో ప్రియాంక పాల్గొననున్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version