మాదిగ విశ్వరూప మహాసభకి ప్రధాని హాజరు.. కంటతడి పెట్టిన మందకృష్ణ మాదిగ

-

పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. మోడీ కి నినాదాల తో ఘన స్వాగతం పలికారు mrps కార్యకర్తలు.మంద కృష్ణ మాదిగ భుజం తట్టారు ప్రధాని మోడీ. ఎమోషన్ అయిన మంద కృష్ణ మాదిగ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ.. మమ్ముల్ని ఈ సమాజం మనుషులుగా చూడలేదు. సామాజిక న్యాయం పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాటలకే పరిమితమయ్యాయి.

మాదిగ జాతిని పశువుల కంటే హీనంగా చూశారు. బీసీనీ సీఎం చేస్తామని చెప్పిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. మేము ఊహించని కల ఇది.. ప్రధాని మోడీ దళితులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. బీసీని సీఎం చేస్తానని చెప్పిన దమ్మున్న నేత నరేంద్ర మోడీ అన్నారు. మాదిగలను కేసీఆర్ అణచివేస్తే.. మోడీ గర్వించి పదవులు ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవీ ఇవ్వలేదు. వెలమలకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు. మాదిగలతో పోల్చితే వారి జనాభా చాలా తక్కువ అన్నారు. 30 ఏళ్ల నుంచి మాదిగలకు అన్యాయం జరిగిందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version