ఉగాది పంచాంగం : 2028 వరకు మోడీనే ప్రధాని !

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేశారు జ్యోతిష్యులు మహేశ్వర శర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2028 మే 5 వరుకు ప్రధానికి తిరుగు లేదని స్పష్టం చేశారు. ప్రతి పక్షాలకు బీజేపీ ప్రభుత్వం ధీటుగా బదులు ఇస్తుందని.. ఈ ఏడాది ఆహార ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పారు. మూడో సారి మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని స్పష్టం చేశారు.

ప్రధాని తీసుకున్న నిర్ణయాలు ను యావత్తు దేశం సమర్దిస్తుందని.. ఈ సంవత్సరం వరదలు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇక అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. పేద ప్రజలు పక్షాన పోరాడడానికి సిద్ధమని… మోడీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా ముందుకు పోతుందని చెప్పారు.

మోదీకి దేశ ప్రజలు అండగా ఉండాలని… ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీదని స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్దంలో మోడీ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చారని… ఉగ్రవాదంతో దేశ ప్రజలకి నష్టమన్నారు. ఉగ్రవాదాన్ని రెండు పార్టీలు మధ్య, ప్రభుత్వం మధ్య యుద్దం అంటున్నారని బండి సంజయ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version