రాహుల్ గాంధీని పప్పు అంటూ ఆడుకుంటున్న నెటిజన్లు

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించారు. తెలంగాణలోని కల్వకుర్తి, జడ్చర్ల, నాగర్ కర్నూల్, మంథని, అంబటిపల్లి తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయభేరీ సభలు, బస్సుయాత్రల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు. ఇక ఇవాళ అంబటిపల్లిలో మహిళలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సందర్శించారు.


మేడిగడ్డ సందర్శనకు కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే అనుమతినిచ్చారు. మిగతా కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేపట్టారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలోనే రాహుల్ గాంధీని పప్పు అంటూ ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఈరోజు రాహుల్ గాంధీ కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లి ఎక్స్ పాన్షన్ జాయింట్ ఫొటో పెట్టి పగుళ్లు అంటూ ఫొటో ట్వీట్ చేయగా.. నెటిజన్లు రాహుల్ గాంధీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version