ఇవాళ 51 బీ ఫాంలు మాత్రమే ఇస్తున్నా – సీఎం కేసీఆర్

-

51 బీ ఫాంలు మాత్రమే రెడీ అయ్యాయి మిగతా బీ ఫాంలు సిద్ధమవుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మళ్లీ విజయం మనదే ఎవరు తొందరపడొద్దని కోరారు సీఎం కేసీఆర్. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్‌ కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కోపతాపాలు పక్కనపెట్టి సమన్వయంతో ప్రచారం చేపట్టాలి. మళ్లీ విజయం మనదే. ఎవరు తొందరపడొద్దు. సాంకేతికంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి’ అని ఎమ్మెల్యే అభ్యర్థులకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ 51 మంది అభ్యర్థుల కు బి ఫారాలు ఇస్తాం..మిగతా వారికి రేపు ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే అభ్యర్థులు కోపాలను తగ్గించుకొని… చిన్న కార్యకర్త అయినా వెళ్లి కలవాలని ఆదేశించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ చేశామని…. భరత్ కుమార్ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. సమస్య ఏమైనా ఉంటే 9848023175 నంబర్‌కు కాల్ చేయాలి.. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version