సీఎం కేసీఆర్ పాము లాంటి వాడు… ఓటు వేస్తే కాటు వేస్తాడు – రేవంత్‌

-

సీఎం కేసీఆర్ పాము లాంటి వాడు… ఓటు వేస్తే కాటు వేస్తాడని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలోని దోమకొండలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్, ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేశారని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే..కానీ ఇప్పుడొచ్చి ఆయనకు ఓటు వేయలని అడుగుతున్నాడని ఫైర్‌ అయ్యారు.

revanth reddyrevanth reddy in domakonda

పదేళ్లలో గుర్తురాని అమ్మగారి ఊరు కొనాపూర్ ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చిందట అంటూ చురకలు అంటించారు. కామారెడ్డి ప్రజల తీర్పును దేశం నిశితంగా గమనిస్తోందన్నారు. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదని…. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా వైశ్యులను కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహించారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి 10లక్షలు, పిల్లల చదువుకు సాయపడేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version