జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన నిర్ణయం..!

-

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పోలీస్ ఎస్కార్టును తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను ఎక్కడికీ వెళ్లినా పోలీస్ వాహనాలు ఎస్కార్ట్ గా వస్తున్నాయని.. సామాన్య ప్రజలకు పోలీసులు సేవలు ఎంతో అవసరం ఉందని.. తన వాహనం ముందు ఎస్కార్ట్ గా పోలీసులు కేటాయించే సమయాన్ని ప్రజల సమస్యలు పరిస్కరించడలంలో శాంతి భద్రతలు కల్పించడంలో వినియోగించాలని కోరారు.

పోలీస్ డిపార్ట్ మెంట్ లో డిమాండ్ కు తగిన సిబ్బంది లేనందున నా కోసం పోలీసులను, ఎస్కార్ట్ వాహనాలు వాడవద్దని కోరుతూ మంగళవారం జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే ఫార్మాట్ లో అనిరుద్ రెడ్డి లేఖ రాశారు. ఈ విషయం జడ్చర్ల నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. కాగా ఎమ్మెల్యే నిర్ణయం పై జిల్లా ఎస్పీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని నియోజకవర్గం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version