కోహీర్ లో తీవ్ర విషాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న చర్చి

-

సంగారెడ్డి జిల్లా కోహీర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలడంతో శిథిలాల కింద పడి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. కోహీర్ లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ప్రమాదానికి గురైంది. మెథడిస్ట్ చర్చి స్లాబ్ వేస్తుండగా కుప్పకూలి ప్రమాదం జరిగింది.

నలుగురు కూలీలు మృతి చెందారు.  శిధిలాలలో మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్లాబ్ వేస్తుండగా, స్లాబ్ చెక్కలు కూలాయి. 8 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి విషమం. సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన వారు గా సమాచారం. ఈ మధ్య కాలంలో ప్రమాదం జరిగిన ఘటనలు కూలీలు మరణించిన సంఘటనలు చాలానే చోటు చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version