నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

-

తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం ఇవాళ్టి నుంచి జులై 5 వరకు ఆన్ లైన్‌లో కౌన్సిలింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో ఈనెల 28 నుంచి జులై 6వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 28వ తేదీ నుంచి జులై 8 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. సీటు వచ్చిన అభ్యర్థులు జులై 12వ తేదీ నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

జులై 21 నుంచి 24వరకు రెండో విడత ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ జరుగుతుంది. జులై 28న రెండో విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 2న తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆగస్టు 7న ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు ఉంటుంది. ఆగస్టు 8న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version