తెలంగాణ కేబినెట్ భేటీలో చర్చించే అంశాలు ఇవే..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో జరుగనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీ.. ఆ తరువాత అసెంబ్లీ కమిటీ హాల్ కి మారింది. ముఖ్యంగా ఈ సమావేశంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు పై చర్చించనుంది.

ఆ తరువాత కొత్త రేషన్ కార్డుల జారీ పై కూడా చర్చించనుంది. రేషన్ కార్డుల యొక్క విధి, విధానాలు, షెడ్యూల్ ని ఖరారారు చేయనుంది. వీటితో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణ తదితర అంశాలకు సంబంధించి చర్చించనుంది. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దానిపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.    

Read more RELATED
Recommended to you

Exit mobile version