దొంగ ఓట్ల నమోదుపై చర్యలు తీసుకోండి: ఈసీకి తుమ్మల లేఖ

-

తెలంగాణలో దొంగ ఓట్ల నమోదుపై ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  ఖమ్మం జిల్లాలో ఇంటి నంబర్లు లేకుండానే ఓట్లు నమోదు చేశారని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా నమోదు చేసిన దొంగ ఓట్ల వివరాలతో కూడిన లేఖను తుమ్మల నాగేశ్వర రావు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ కు అందించారు.

“ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 30 వేలకు పైగా ఓట్లను ఇంటి నంబర్లు లేకుండానే నమోదు చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌, సీఈవో ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ మేరకు గతంలో చేసిన 9 ఫిర్యాదుల వివరాలను ఇందులో పేర్కొన్నాను. ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలి. ఇంటి నంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించి.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. జాబితా నుంచి దొంగ ఓట్లను తొలగించిన తర్వాతే తుది ప్రకటన విడుదల చేయాలి.” అని ఎన్నికల సంఘాన్ని తుమ్మల కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version