ఎవ‌రు గెలిస్తే మంచిదో నిర్ణ‌యించి ఓటేయాలి : సీఎం కేసీఆర్

-

సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ముఖ్యంగా ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు ఆగ‌మాగం కాకుండా.. ఎవ‌రు గెలిస్తే మంచిదో నిర్ణ‌యించి ఓటేయాలి.. ఆషామాషీగా, అల‌వోక‌గా ఓటు వేయొద్ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. మీరు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఏందంటే అభ్య‌ర్థి గుణ‌గ‌ణాలు, సేవాత‌త్వం గురించి ఆలోచ‌న చేయాలి. ఆ అభ్య‌ర్థుల‌ వెనుకాల ఏ పార్టీ ఉంది.

వాటి చ‌రిత్ర విధానాలు, ప్ర‌జలు, రైతుల గురించి ఏం ఆలోచిస్తుంది..? అధికారం వ‌స్తే ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో ఆలోచించాలి. ఎన్నిక‌లు అయిపోగానే ప్ర‌క్రియ ఆగిపోదు. ఇక్క‌డ గెలిచే ఎమ్మెల్యేతో రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది. మీ ఓటు వ‌జ్రాయుధం, చాలా విలువ ఉంట‌ది. ఐదేండ్లు మీ త‌ల‌రాత‌ను రాస్త‌ది. భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్త‌ది. అందుకే జాగ్ర‌త్త‌గా ఓటు వేయాలి. ఆషామాషీగా, అల‌వోక‌గా వేయొద్దు. మంచి ఆలోచించే వారికి ఓట్లు వేయాలి. ఏ ప్ర‌భుత్వం ఏం చేసిందో లెక్క తీసి ఓట్లు వేస్తే లాభం జ‌రుగుత‌ది. ప్ర‌జాస్వామ్య ప‌రిణితి పెరిగి, విచ‌క్ష‌ణ జ్ఞానంతో ఎవ‌రు గెలిస్తే మంచిదో నిర్ణ‌యించి ఓటేయాలి అని ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version