యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మెడికల్‌ కాలేజీ

-

తెలంగాణలో మరో వైద్య కళాశాల రాబోతోంది. ఎక్కడో తెలుసా..? ఇంకెక్కడ.. తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రిలో. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో… మెడికల్‌ కాలేజీకి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో సచివాలయంలో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.

25 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మించనున్నట్లు హరీశ్‌ రావు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైద్య కళాశాలగా ఈ కాలేజీకి పేరు పెట్టినట్లు చెప్పారు. మూడు చోట్ల స్థలాన్ని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు స్థలం గుర్తించిన తర్వాత నివేదిక అందిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థలంపై తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు.  తుది స్థలం ఎంపిక పూర్తైన వెంటనే శంకుస్థాపన ఉంటుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version