వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. మాజీ సర్పంచ్ లు ఆందోళన..!

-

వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ లు ఇవాళ ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 7 మండలాల మాజీ సర్పంచ్ లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా E.G.S పనుల పెండింగ్ బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

మాజీ సర్పంచులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ సర్పంచులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాజీ సర్పంచ్ లను అడ్డుకుని సముదాయించారు. అనంతరం మాజీ సర్పంచ్ లు అందరూ కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు. తమ పదవీకాలంలో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ల వినతి పత్రంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version