జగన్ కలిసే కేంద్ర మంత్రుల లిస్టు ఇదే…!

-

ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఆయన ఢిల్లీ వెళ్ళారు. రెండు గంటలు ముందుగా ఢిల్లీ చేరుకొని వైసీపీ ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీ చేరినట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన ఎంపీలను అడిగి వ్యవసాయ బిల్లుల గురించి కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. జగన్ నేడు సాయంత్రం హోం మంత్రి అమిత్ షాని కలిసే అవకాశం ఉంది.

jagan

ఆయనతో పాటుగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా జగన్ కలిసే అవకాశం ఉంది. రేపు కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్, జల శక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సిఎం జగన్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో చర్చించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version