అప్పులబాధతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని చిత్తూరు జిల్లా ల్లో దారుణ మైన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం రాచ పాలెం గ్రామం లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళితే… ఆ కుటుంబం లోని పెద్ద కుమారుడు చేసిన అప్పు ఆ కుటుంబాన్ని బలి తీసుకుందని స్థానికులు చెబుతున్నారు.

రూ. కోటిననరకు పైగా చేసిన అప్పు తీర్చక పోగా.. బాధ్యత లేకుండా భార్యను తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. దీంతో అప్పు ఇచ్చిన వారు..తమ అప్పు తీర్చాలని ఆ కుటుంబం పై ఒత్తిడి తెచ్చారు. తల్లి, తండ్రి, మరో కుమారుడిని నిలదీశారు. కొందరు పరుష పదజాలం ఉపయోగించారు. దీంతో మానసికంగా కృంగిపోయిన ఆ ముగ్గురు… పురుగుల మందు తాగి సుసైడ్‌ చేసుకున్నారు. మృతులు శంకరయ్య, గురవమ్మ, వినయ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…. విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version