దేశ రాజధాని ఢిల్లీకి నేడు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సీఎం, డిప్యూటీసీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్ కి హాజరవుతారు. ఇవాళ రాత్రికి ఇద్దరూ ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.
అమరావతి పున: ప్రారంభానికి ప్రధాని మోడీని సీఎం ఆహ్వానించనున్నారు. రాజధాని నిధులతో పాటు పలు అంశఆలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. బుధవారం తిరిగి సీఎం, డిప్యూటీ సీఎం అమరావతికి చేరుకోనున్నారు. ఏపీ శాసనసభ 13వ రోజు సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో కాలువల ఆక్రమణలు, ప్రైవేట్ పాఠశాలలో భద్రత చర్యలు, బుడమేరు ఆక్రమణ, సూపర్ సిక్స్ పథకాలు వంటి అంశాలపై శాసనసభలో ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి.