రాజేంద్ర న‌గ‌ర్‌లో విషాదం.. న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

-

అద‌న‌పు క‌ట్నం, భర్త వేధింపులు భ‌రించ‌లేక ఒక న‌వ వ‌ధువు త‌నువు చాలించుకుంది. ఈ విషాద క‌ర ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని రాజేంద్ర న‌గ‌ర్ లో గ‌ల ల‌క్ష్మీగూడలో చోటు చేసుకుంది. కాగ రాజేంద్ర న‌గ‌ర్ లో గ‌ల లక్ష్మీగూడలో వ‌సంత అనే మ‌హిళ త‌న భ‌ర్త ర‌మేశ్ తో ఉంటుంది. వీరికి తొమ్మిది నెల‌ల క్రితం వివాహం జ‌రిగింది. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి రమేశ్.. వ‌సంత పై శ‌రీరకంగా, మాన‌సికంగా వేధిస్తున్నాడు. అద‌న‌పు క‌ట్నం తీసుకురావాల‌ని ప్ర‌తి రోజు హింసిస్తున్నాడు.

భ‌ర్త వేధింపులు భ‌రించ లేక వ‌సంత.. ఈ రోజు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హ‌త్య చేసుకుంది. త‌లుపులు తీయక‌పోవ‌డం.. బ‌ద్ద‌లు కొట్టి చూశారు. దీంతో వ‌సంత ఫ్యాన్ కు వ్రేలాడుతూ క‌నిపించింది. దీంతో స్థానిక‌లు మైలార్ దేవి ప‌ల్లి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు. వ‌సంత మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version