మ‌హా శివ‌రాత్రికి టీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

-

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం స‌మీపిస్తున్న విషయం తెలిసిందే. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టీఎస్ ఆర్టీసీ సిద్ధం అవుతుంది. భ‌క్తుల సౌకర్యం కోసం మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ దినాన టీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నుంది. ఈ ప్ర‌త్యేక బ‌స్సులు రేప‌టి నుంచి మార్చి 4వ తేదీ వ‌ర‌కు ఉంటాయ‌ని టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్ల‌డించారు. ముఖ్యంగా మ‌హా శివ‌రాత్రి రోజు అత్యంత ర‌ద్దీ ఉండే కీస‌ర గుట్ట‌, ఏడుపాయ‌ల‌, బీరంగూడ‌ల‌కు ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌త్యేక బ‌స్సులు న‌డుపుతున్నట్టు అధికారులు వెల్ల‌డించారు.

వీటితో పాటు అల్వాల‌, అమ్మూగూడా, బాలా న‌గ‌ర్ క్రాస్ రోడ్డు, మియాపూర్ క్రాస్ రోడ్డు, ప‌టాన్ చెరువ‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో ప్ర‌త్యేక బ‌స్సులు న‌డుపుతున్నట్టు ప్ర‌క‌టించారు. అలాగే 30 మంది ప్ర‌యాణికులు ఒకే చోట ఉంటే.. అక్క‌డికి ఆర్టీసీ బ‌స్సును ప్ర‌త్యేకంగా పంపిస్తామ‌ని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ అందిస్తున్న ప్ర‌త్యేక బ‌స్సుల సేవ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రు వినియోగించు కోవాల‌ని అధికారులు కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version