వివేకా హత్య కేసు.. హైదరాబాద్​ సీబీఐ కోర్టులో నేడు నిందితుల హాజరు

-

మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులను పోలీసులు కడప జైలు నుంచి హైదరాబాద్ కు తరలించారు.  సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని నాలుగు వాహనాల్లో ముగ్గురు నిందితులను వేర్వేరుగా పోలీసులు హైదరాబాద్​కు తీసుకొచ్చారు. ఇప్పటికే బెయిల్​పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్​ దస్తగిరి హైదరాబాద్​ చేరుకున్నారు. నిందితులను ఇవాళ ఉదయం 10 : 30 గంటలకు సీబీఐ కోర్టులో హాజరపరచనున్నారు.

వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయిన తర్వాత తొలిసారిగా ఐదుగురు నిందితులు హైదరాబాద్​లో సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు. కోర్టులో హాజరైన తర్వాత ముగ్గురు నిందితులను తిరిగి కడప జైలుకు తీసుకొస్తారా లేక చంచల్​గూడ తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇది న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నిందితులను హైదరాబాద్​కు తరలిస్తున్న క్రమంలో గురువారం సాయంత్రమే దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ, కుమారుడు చైతన్య రెడ్డి జైలుకెళ్లి ఆయన్ను కలిసి వచ్చారు. శివశంకర్ రెడ్డి అనుచరులు కూడా హైదరాబాద్​ చేరుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version