అప్పులు చేసిన శ్రీలంక గతి ఏమైందో చూస్తున్నాం – ఈటెల రాజేందర్

-

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అప్పులు చేసిన శ్రీలంక గతి ఏమైందో చూస్తున్నామని అన్నారు.తెలంగాణలో 60 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అప్పుకోసం కడుతున్నారని అన్నారు.పెట్టే ఖర్చులో 1/3 అప్పు కోసం, అప్పు కట్టడానికే పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎంగా కనీస బాధ్యత ఉండాలని, అధికారం ఉందని నీ తాత జాగీరులాగా చేయవద్దని, రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని సూచించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రబొదానుసారం ఓటు వేయాలని అన్నారు.ద్రౌపది ముర్ము గారు గొప్ప మెజారిటీతో గెలవబోతున్నారని, ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలం కేంద్ర ప్రభుత్వాన్ని కొరామని అన్నారు.రాష్ట్ర పార్టీ ద్వారా కూడా నివేదిక పంపించామన్నారు. తెలంగాణ బిజెపి ముగ్గురు ఎమ్మెల్యేలం ముంపుకు గురి అయిన ప్రాంతాలను సందర్శిస్తామని తెలిపారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version