ఏలూరులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు చొదిమెళ్ల వద్ద లారీని ఢీకొట్టి బోల్తా పడింది బస్సు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అంతేకాదు…ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.