ముంబై ఇండియన్స్ సంచలన సృష్టించింది. మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది ముంబై. WPL-2025 విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్లో 8 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.

రెండోసారి టైటిల్ను సొంతం చేసుకుంది.150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకు పరిమితమైంది. అంతకుముందు ముంబయి 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కాగా 2023 WPLలో కూడా ఛాంపియన్ గా నిలిచింది ముంబై ఇండియన్స్.