జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేసిన తుళ్లూరు పోలీసులు

-

Thullur police arrest journalist Krishnam Raju: జర్నలిస్టు కృష్ణంరాజుకు బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేశారు తుళ్లూరు పోలీసులు. విశాఖలో ఆయనను అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు పోలీసులు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్లో కృష్ణంరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Thullur police arrest journalist Krishnam Raju
Thullur police arrest journalist Krishnam Raju

ఇక రేపు కృష్ణం రాజును రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావుకు ఊహించని షాక్ తగిలింది. కొమ్మినేని శ్రీనివాస్ రావు రిమాండ్‌ విధించారు. కొమ్మినేనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. నేడు మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. దింతో గుంటూరు జిల్లా జైలుకు కొమ్మినేని తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news