ఏడు ద్వారాలు, వేల కిలోల బంగారం.. వెల్లూరు సమీపంలో అద్భుత దేవాలయం!

-

స్వర్ణ దేవాలయం అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది పంజాబ్‌లోని అమృత్‌సర్. కానీ అంతకు మించి ధగధగలాడిపోతూ.. ఏకంగా 1500 కిలోల బంగారంతో నిర్మించిన మరో అద్భుత స్వర్ణ దేవాలయం మన సౌత్ ఇండియాలోనే ఉంది! వంద ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 600 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయం తమిళనాడులోని శ్రీపురంలో కొలువై ఉంది. ఎంతో విశిష్టత ఉన్న ఈ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

ఎక్కడ ఉంది? దీని కథేంటి?: ఈ అద్భుత స్వర్ణ దేవాలయం చెన్నైకి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలూరు సమీపంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని తిరుమలైకోడిగా పిలిచేవారు. కానీ ఇక్కడ ఆలయాన్ని నిర్మించాక దీని పేరును ‘శ్రీపురం’గా మార్చారు. నూట యాభై మంది శిల్పులు దాదాపు ఆరేళ్ల పాటు అహోరాత్రులు శ్రమించి ఈ అద్భుత ఆలయాన్ని తీర్చిదిద్దారు.

నక్షత్ర మార్గం.. ఏడు ద్వారాలు: ఈ ఆలయం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆంతర్యం దాగుంది. గర్భగుడిలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకోవాలంటే.. కిలోమీటరున్నర దూరం ఉండే నక్షత్ర ఆకారపు మార్గంలో నడిచి వెళ్ళాలి. ఆ దారి పొడవునా గోడలపై భగవద్గీత, ఖురాన్, బైబిల్ లోని మంచి ప్రవచనాలు రాసి ఉంటాయి. ఆలయంలోకి వెళ్లేటప్పుడు ఏడు జన్మలకు ప్రతీకగా ఏడు ద్వారాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది.

అమ్మవారి దివ్య రూపం: గర్భగుడిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని గ్రానైట్ రాతితో చెక్కి, ఆ తర్వాత దానికి పూర్తి బంగారు తొడుగు వేశారు. వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు మరియు ప్లాటినంతో చేసిన దివ్యమైన నగలను అమ్మవారికి అలంకరిస్తారు. ఈ ఆలయంలో వీఐపీ దర్శనాలు లాంటివి ఏమీ ఉండవు! సామాన్యులైనా, సెలబ్రిటీలైనా సరే ఒకే దారిలో క్యూలైన్లో వెళ్లి అమ్మను దర్శించుకోవాలి.

Seven Gates & Tons of Gold: Stunning Temple Near Vellore You Must Visit
Seven Gates & Tons of Gold: Stunning Temple Near Vellore You Must Visit

ఎవరు నిర్మించారు?: ఇంత భారీ ఆలయాన్ని నిర్మించింది ఒక సాధారణ మిల్లు కార్మికుడి కొడుకు కావడం విశేషం! వేలూరుకు చెందిన సతీష్ కుమార్ అనే భక్తుడు చిన్నప్పటి నుంచే దైవచింతనతో ఉండేవారు. 16 ఏళ్ల వయసులో ఆయన తన పేరును ‘శక్తి అమ్మ’గా మార్చుకుని నారాయణి పీఠాన్ని స్థాపించారు. బస్సులో వెళ్తున్నప్పుడు ఇక్కడ అమ్మవారి దివ్య కాంతి కనిపించడంతో, భక్తుల నుంచి వచ్చిన భారీ విరాళాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో చాలామంది ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. తిరుపతి నుండి సుమారు 134 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని ముఖ్యంగా చీకటి పడిన తర్వాత లైట్ల వెలుతురులో చూస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. వీలు కుదిరితే మీరు కూడా తప్పకుండా వెళ్లి రండి!

గమనిక: ఇక్కడ రోజూ ఉదయం 5 నుండి 7:30 వరకు అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు జరుగుతాయి. ఉదయం 7:30 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనాలు అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news