20 ఏళ్లు దాటిన వారికి అలర్ట్.. ఏటా రెండుసార్లు కిడ్నీ పరీక్షలు?

-

భారతదేశంలో తీవ్రమవుతున్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల (CKD) అడ్డుకట్టకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక అత్యంత కీలకమైన సిఫార్సు చేసింది. 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం రెండుసార్లు తప్పనిసరిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. హెచ్‌ఐవీ-ఎయిడ్స్ తరహాలోనే జాతీయ స్థాయిలో కిడ్నీ వ్యాధులపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ అభిప్రాయపడింది.

ముందస్తు గుర్తింపే ఏకైక మార్గం: కిడ్నీ వ్యాధులు ప్రారంభ దశలో ఎలాంటి పెద్ద సంకేతాలు చూపించవు. అందుకే వ్యాధి ముదిరే వరకు చాలామందికి విషయం తెలియడం లేదు. ఇక ముందస్తుగా ఈ పరీక్షలు చేయడం వల్ల ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి ప్రాణాపాయాన్ని నివారించవచ్చని కమిటీ స్పష్టం చేసింది.

Over 20? Experts Recommend Regular Kidney Health Checks
Over 20? Experts Recommend Regular Kidney Health Checks

పేదలకు ఉచిత పరీక్షలు: సామాన్యులకు, పేద ప్రజలకు వైద్య భారం కాకుండా చూసేందుకు ఈ కిడ్నీ పరీక్షలను ఉచితంగా అందించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష చేయించుకోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరగకుండా అడ్డుకోవచ్చని తెలిపింది.

జాతీయ స్థాయిలో అవగాహన: గతంలో ఎయిడ్స్ వ్యాధిపై ప్రభుత్వాలు నిర్వహించినట్లే, ఇప్పుడు కిడ్నీ సమస్యలపై కూడా జాతీయ స్థాయిలో విస్తృత అవగాహన ప్రచారాలు చేపట్టాలని సూచించింది. ఇక సరైన జీవనశైలి, క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవడం ద్వారానే ఈ సమస్యను నియంత్రించగలమని పేర్కొంది.

ఇక మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల కిడ్నీ సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో కిడ్నీ రోగుల సంఖ్యను తగ్గించడంలో మరియు ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో ఇదొక విప్లవాత్మకమైన మార్పుగా నిలుస్తుంది.

గమనిక: ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సు ఆధారంగా అందించిన సమాచారం. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మరియు కిడ్నీ ఆరోగ్య పరీక్షల కోసం మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.

Read more RELATED
Recommended to you

Latest news