గూస్ బంప్స్ తెప్పించే కాంబినేషన్లో అల్లు అర్జున్ డైరెక్టర్..!!

-

టాలీవుడ్ లో హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో చిరంజీవి సపోర్టుతో ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. త్వరలోనే పుష్ప -2 సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ ఎన్నడూ చూడని విధంగా ఒక మాస్ లుక్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

అయితే అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఏ సినిమా చేస్తాడు అనే సందేహం అభిమానులలో కలుగుతోంది. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. అల్లు అర్జున్ పుష్ప సినిమా కంటే ముందుగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా టైటిల్ ని కూడా ఐకాన్ అనే పేరుతో టైటిల్ ను కూడా అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఆ సమయంలో పుష్ప సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ ఉండగా డైరెక్టర్ వేణు మాత్రం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా షూటింగ్లో ఉండడంతో ఆ సినిమా మధ్యలో ఆగిపోవడం జరిగింది.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఇండస్ట్రీలోని వార్తల ప్రకారం పుష్ప -2 సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అలా వైకుంఠపురం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు వచ్చాయి.. ఈ చిత్రాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక అంతే కాకుండా పలు యాడ్స్ కూడా చేశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి త్రివిక్రమ్ మహేష్ బాబుతో ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ తో సినిమా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version