బన్నీ అభిమానులను క్షమాపణలు కోరిన దేవిశ్రీప్రసాద్.. కారణం..?

-

ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే దేవిశ్రీప్రసాద్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమా అంటే దేవిశ్రీప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు అని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. ఇక బన్నీపై దేవిశ్రీప్రసాద్ కు ఏ రేంజ్ లో అభిమానం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు . ఇకపోతే తాజాగా దేవిశ్రీప్రసాద్ బన్నీ అభిమానులను క్షమాపణలు కోరారు. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ నెల రెండవ తేదీన దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు కాగా..ఆ రోజు అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా దేవిశ్రీప్రసాద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని దేవి ప్రసాద్ ఆ ట్వీట్ ను చూసుకోలేదు. తాజాగా ఆ ట్వీట్ ను చూసిన డి.ఎస్.పి ఆ ట్వీట్ కి రీ ట్వీట్ చేయడంతో పాటు బన్నీ అభిమానులను క్షమాపణలు కూడా కోరారు. ఇక పుష్ప సినిమా కోసం అదరగొట్టే ఆల్బమ్ సిద్ధమవుతుందని , ఆల్బమ్ ను కూడా ఐకానిక్ గా మారుద్దామని దేవిశ్రీప్రసాద్ బన్నీ ట్వీట్ కు బదులిచ్చారు. ఇకపోతే దేవిశ్రీప్రసాద్ ఇలా పాజిటివ్గా ట్వీట్ చేయడంతో బన్నీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టు సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజికల్ హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం . అంతే కాదు ఈ సినిమా తర్వాత పలు క్రేజీ ప్రాజెక్టులకు మ్యూజిక్ అందిస్తున్నారు దేవిశ్రీప్రసాద్. ఇక ఈయన జాబితాలో రంగ రంగ వైభవంగా సినిమాతో పాటు మెగా 154వ చిత్రం కూడా ఉంది.

ఇక ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు 4 కోట్ల రూపాయలు రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారు దేవి శ్రీ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version